← Back to news

విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు పిలుపు

By DK· 19 Aug 2026
విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు పిలుపు

TG: రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రం యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్(YTPS) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమరశంఖం పూరించారు. PRCతోపాటు మొత్తం 14డిమాండ్ల సాధన కోసం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ‘చలో హైదరాబాద్’ పేరుతో విద్యుత్తుసౌధలో మహాధర్నా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సంస్థలకు చెందిన ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు పెద్దసంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని JAC చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు.

More in TG