మెకేదాటు డ్యామ్ అంశంపై రాజకీయాలు వద్దు: విజయ్

మెకేదాటు డ్యామ్ వివాదంపై అన్ని పార్టీల సమావేశం అవసరం లేదని, ఈ అంశంపై రాజకీయాలు చేయవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోడీకి లేఖ ద్వారా తమ వైఖరిని తెలిపినట్లు అసెంబ్లీలో చెప్పారు. నదీ జలాలు, మెకేడాటు డ్యామ్ హక్కులపై తమ ప్రభుత్వం రాజీ పడదని వివరించారు. వేరే పార్టీలలాగా గత చరిత్రను లాగి చౌకబారు రాజకీయాలు చేయనని అన్నారు.


