స్టూడెంట్స్ కి సచిన్ మెసేజ్ !

పేపర్ లీకేజీలపై పోరాడుతున్న విద్యార్థులకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. విద్యావ్యవస్థ పారదర్శకంగా, మెరిట్ కి పట్టం కట్టాలని అన్నారు. ఓడినా పరవాలేదు కానీ మోసం కూడదు- షార్ట్కట్లు వద్దన్న తన తండ్రి మాటలను గుర్తుచేస్తూ.. కష్టపడి చదివే యువతకు అన్యాయం జరగకుండా, నిజాయితీకి పట్టం కట్టే వాతావరణాన్ని సమాజం కల్పించాలని పిలుపునిచ్చారు.



