APలో మరో కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన!

AP: త్వరలో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ MP విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలలో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి, పార్టీ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు. పార్టీకి శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు చెప్పారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు.



