← Back to news

తులం బంగారం హామీ ఏమైంది? : సండ్ర

By DK· 19 Aug 2026· ఖమ్మం జిల్లా
తులం బంగారం హామీ ఏమైంది? : సండ్ర

TG: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన భారీ నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా కేసీఆర్‌ ఈ పథకాలను ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద సాయం, తులం బంగారం అందించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సండ్ర డిమాండ్ చేశారు.

More in TG