తులం బంగారం హామీ ఏమైంది? : సండ్ర

TG: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన భారీ నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా కేసీఆర్ ఈ పథకాలను ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద సాయం, తులం బంగారం అందించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సండ్ర డిమాండ్ చేశారు.



