ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సరోజ్(20), సావిత్రి(19), సంతోష్(18) ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తమ కెమెరామెన్ వికాస్ను గుడిలో పెళ్లాడారు. ఫ్యామిలీ వేర్వేరు పెళ్లిళ్లు చేయాలని చూడటంతో, ఇలా చేశామన్నారు. స్థానిక హిందూ సంస్థలు సనాతన ధర్మానికి విరుద్ధమని అభ్యంతరం చెప్పినా.. ‘ఆ రోజుల్లో రాజులు ఎంతోమందిని పెళ్లిళ్లు చేసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు మాకెందుకు?’ అంటూ ప్రశ్నించారు.



