← Back to news

బస్సు-కంటైనర్ ఢీ.. క్షణాల్లో మారిపోయిన ప్రయాణం

By DK· 26 Aug 2026· సూర్యాపేట జిల్లా
బస్సు-కంటైనర్ ఢీ.. క్షణాల్లో మారిపోయిన ప్రయాణం

TG: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం డ్రైవర్‌ నిర్లక్ష్యమా, అతివేగమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More in TG