22ఏ భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం: రేవంత్

TG: 22ఏ భూముల విషయంలో CM రేవంత్ రెడ్డి కీలక భరోసా ఇచ్చారు. ప్రైవేట్ భూముల యజమానులు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. 22ఏ నిషేధిత భూముల రెజిస్ట్రేషన్లపై హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటే అధికారులు రెండురోజుల్లో పరిశీలించాలన్నారు. 22ఏ జాబితాలను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, తప్పులు లేకుండా తుది జాబితా రూపొందించాలని ఆదేశించారు.



