గాంధీభవన్ నిరసనలపై DCC అధ్యక్షురాలు సీరియస్

TG: కొమురంభీమ్ జిల్లా కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాలపై DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పందించారు. డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో పేరుతో హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట చేపట్టిన నిరసనలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆసిఫాబాద్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పార్టీపై అసంతృప్తులు ఉంటే అంతర్గతంగా చర్చించాలని, బహిరంగ నిరసనలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల ఆశతో కొందరు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.



