SC వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఆగదు: రత్నాకర్

AP: SC వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. RS.రత్నాకర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. SC వర్గీకరణతో మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత విభజించడం వల్ల దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటుందని అన్నారు. దేశ సంపద, అధికార వ్యవస్థల్లోనూ సామాజిక న్యాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.



