← Back to news

శాఖల సమన్వయ లోపం.. వాహనదారులకు నరకం

By DK· 11 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
శాఖల సమన్వయ లోపం.. వాహనదారులకు నరకం

TG: వర్షాకాలం నేపథ్యంలో అన్నిశాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన సంస్థ ఆధ్వర్యంలో జరగాల్సిన సన్నద్ధతపై దృష్టిసారించలేదు. హైడ్రా హడావుడి చూసి.. అన్ని పనులను హైడ్రానే చూసుకుంటుందని మూడు కార్పొరేషన్లు చేతులెత్తేశాయి. గతంలో నగరంలో GHMC ఒక్కటే ఉండేది. తర్వాత హైడ్రా వచ్చింది. తాజాగా మరో రెండు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వరదలో చిక్కుకొని సుమారు మూడులక్షల మంది వాహనదారులు అర్థరాత్రి వరకు రోడ్లపై పడిగాపులు కాస్తే అధికారులు కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More in Local