← Back to news

ప్రొటోకాల్‌ను విస్మరించిన గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

By Dr.Steven Polamneni· 16 Aug 2026
ప్రొటోకాల్‌ను విస్మరించిన గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

AP: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం జివి పురం గ్రామపంచాయతీ పరిధిలో దళిత ఎంపీటీసీ పత్తూరు ఈశ్వరమ్మ, బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ సర్పంచి కాణిపాకం సుబ్బలక్ష్ముమ్మ ఉండగా, ప్రోటోకాల్ ప్రకారం దళిత ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ విస్మరించారని గ్రామస్థులు మండిపడుతున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అవమానించిన జీవి పురం గ్రామపంచాయతీ కార్యదర్శి గిరిపై అఖిలభారత అంబేద్కర్ సేన జాతీయ ఎస్సీ కమిషన్ వారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

More in Local