← Back to news

ఇళ్ల మంజూరులో రాజకీయాలకు చోటులేదు: పొంగులేటి

By DK· 3d ago
ఇళ్ల మంజూరులో రాజకీయాలకు చోటులేదు: పొంగులేటి

TG: గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ.. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మంత్రి సీతక్కతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన రైతులకు పట్టా పాస్‌బుక్కులు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కులం, మతం, రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని అన్నారు. కాంగ్రెస్‌ విధానం గల్లీగల్లీకి అభివృద్ధి, గడపగడపకు సంక్షేమమని సీతక్క పేర్కొన్నారు.

More in TG