సూరసముద్రం చెరువు పరిరక్షణకు చర్యలు

TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని సూరసముద్రం చెరువును మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. చెరువును పరిశుభ్రంగా, సుందరంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పత్య నాయక్ అన్నారు. చికెన్, మటన్, చేపల వ్యర్థాలు, ఆసుపత్రుల సిరంజీలు, గాజు ముక్కలు తదితరాలను చెరువులో వేయొద్దని సూచించారు. ‘మన ఊరు–మన చెరువు’ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు.



