ప్రజా పాలన కాదు.. దగా పాలన: గండ్ర

TG: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడలిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు చేపట్టారు.



