పశువుల అక్రమ తరలింపుపై పోలీసుల దాడులు

TG: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి మార్కెట్కు అక్రమంగా పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 57 పశువులు, 5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ పశువుల తరలింపుపై సమాచారం అందడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.




