ఫార్మా యూనిట్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
TG: యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెం దగ్గరలో భారీ ప్రమాదం జరిగింది. Hazelo Labలో రియాక్టర్ బ్లాస్ట్ అయ్యింది. నిన్న అర్ధరాత్రి షిఫ్ట్ మారుతున్న టైమ్లో ఈ బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంప్లాయీస్ మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. బ్లాస్ట్కు కారణాలపై పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదం గతంలో కూడా జరిగినట్టు తెలుస్తోంది.



