‘యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది’
TG: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలో ఓ యువకుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గడిచిన 12 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో అనేక విధ్వంసాలు చూశామని, యువత తిరగబడితే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థి వ్యతిరేక పాలసీలలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు మేకులు కొట్టిన లాఠీలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.



