దిమాగీ నక్సల్ పార్టీ..మరో కొత్త మూమెంట్

‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలో దేశంలో మరో కొత్త మూమెంట్ మొదలైంది. అదే ‘దిమాగీ నక్సల్ పార్టీ’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’(Intellectual Naxals) అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో ‘నక్సల్ మెంటాలిటీ’ ఉన్నవారిని గుర్తించాలని, యువతను వాళ్లకు దూరంగా ఉంచాలని అన్నారు. దీనికి రియాక్షన్గా ఈ పార్టీ మొదలైంది. అప్పుడే ఈ పార్టీ ఇన్స్టా ఖాతాకు 47 వేల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఈ పార్టీకి Think, Research, Resist అనే సిద్ధాంతాలు ఉన్నట్టు ప్రకటించారు.


