కేంద్ర మంత్రులు ఇన్స్టా రీల్స్ చేయాలా?: అభిజీత్ దీప్కే
ప్రధాని మంత్రులను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ రీల్స్ చేయాలని చెప్పడం ఏంటని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రధాని మోదీపై మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీపై చర్యలు తీసుకుంటామని కేబినెట్ భేటీని ఏర్పాటు చేసిన ప్రధాని విద్యార్థుల భవిష్యత్తు, సమస్యను పరిష్కరించడం వదిలేసి ఇవన్నీ చెప్పడం ఎందుకుని ప్రశ్నించారు. దేశానికి నిజంగా చదువుకున్నవాడే ప్రధానిగా ఉండాలని సెటైర్లు వేశారు.



