లీక్ అనుకుంటే పొరపాటే.. వెలుగులోకి 'హైటెక్' మోసం!

పంజాబ్ ఫార్మసీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ వివాదం పేపర్ లీక్ కాదని, అదొక హైటెక్ మోసమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు. హర్యానాలోని భివానీ కేంద్రంగా నడుస్తున్న ఒక ముఠా ఈ స్కామ్ వెనుక ఉందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది మెయిన్ నిందితులు, 25 మంది కాండిడేట్స్, 8 మంది హ్యాండ్లర్లతో సహా మొత్తం 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్న ఐదుగురి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.



