చేతివృత్తిదారుల సమస్యలు తీర్చాలి

AP : చిత్తూరు జిల్లా పలమనేరులో చేతివృత్తిదారుల సమస్యలపై CPI నాయకులు పి.రఘు, ఎస్.నాగరాజు కరపత్రాలు విడుదల చేశారు. ఆగస్టు 29న కలెక్టరేట్ వద్ద జరిగే నిరసనను సక్సెస్ చేయాలని కోరారు. చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక మినిస్ట్రీ పెట్టాలని, బడ్జెట్లో ఫండ్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ.5 లక్షల లోన్పై 50% సబ్సిడీ ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన వారికి రూ.6 వేల పెన్షన్, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.



