66 రోజులైనా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ

AP: కాకినాడ జిల్లా తుని గ్రామీణ మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జానూ) జూన్ 6న మిస్సయ్యింది. తన వెంట వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి వచ్చి చనిపోయింది. జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. మరో కుక్క పిల్లను తెచ్చుకున్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు దానికి ‘జాను’ అని పేరుపెట్టారు. తమ కుమార్తెను ఎవరో వెంట తీసుకు వెళ్ళిపోయారని భావిస్తున్న తల్లి భవాని కుమార్తె ఆచూకీ చెప్పాలని వేడుకుంటోంది.



