గాయం చేశాక మందు రాస్తే లాభం ఏంటి?
నెలన్నర రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న తర్వాత ప్రధాని తీరిగ్గా స్పందించారని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మండిపడ్డారు. పేపర్ లీక్ జరిగిన తర్వాత శిక్షలు వేయడం వల్ల సమస్య తీరదని, గాయమయ్యాక మందు రాయడం కంటే అసలు గాయమే కాకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం, సమర్థత లేకపోవడం వల్లే లీక్లు జరుగుతున్నాయని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదని చెప్పారు.



