చేయూత పింఛన్లకు కాంగ్రెస్ సర్కార్ కొత్త రూల్స్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 'చేయూత' పింఛన్ల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి ఉంటే పింఛన్ రాదని తెలిపింది. అలాగే సంవత్సర ఆదాయం ఊళ్లలో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు దాటితే అనర్హులు. ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్, ప్రైవేట్, కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ జాబ్ చేస్తున్నా పింఛన్ రాదని, అర్హుల ఎంపిక కోసం శనివారం ఈ రూల్స్ రిలీజ్ చేసింది.



