← Back to news

నవులూరు ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

By epuri rajaratnam· 27 Aug 2026

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు టీడీపీ నాయకులు రూ.15 వేల విలువైన All in one ప్రింటర్, బయోమెట్రిక్ మిషన్‌ను బహూకరించారు. పేద విద్యార్థులు జిరాక్స్ కాపీలు, పరీక్ష పత్రాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని HM చెప్పడంతో స్పందించిన దాతలు ఈ సదుపాయాలను అందించారు.కొల్లి వెంకటరావు, బత్తుల నాగరాజు, తోట శ్రీనుబాబు, రుద్రం శ్రీనివాస రావు, పేరుబోయిన వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సమాజం అండగా నిలిస్తే విద్యార్థులకు మంచి విద్య అందుతుందన్నారు.

More in Local