ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ సేవలు: రేవంత్ రెడ్డి

TG: విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని CM రేవంత్రెడ్డి అన్నారు. HYDలోని సనత్నగర్లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్య, వైద్యంపై చేసే వ్యయాన్ని పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ కింద రూ.2,700 కోట్లు చెల్లించామని తెలిపారు. 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు.



