YSRCP మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్.. జైలుకు తరలింపు

AP: కిడ్నాప్, SC, ST అట్రాసిటీ కేసులో YSRCP మాజీ MLA ముస్తఫాకు నూజివీడు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోయిలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్ కేసులో ముస్తఫా, ఆయన కొడుకు బషీర్ నిందితులుగా ఉన్నారు. అబ్స్కాండింగ్లో ఉన్న ముస్తఫాను పోలీసులు గుజరాత్లో అదుపులోకి తీసుకుని, మిడ్నైట్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా రిమాండ్కు ఆదేశించింది. తరువాత ఆయనను, బషీర్ను నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు.



