AE ఫ్యామిలీ సూసైడ్?

పిఠాపురం AE నూకరాజు ఫ్యామిలీ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో షేక్ సాదిక్ ఖాన్పై పోలీసులు ఇంకో మర్డర్ కేసు కూడా ఫైల్ చేశారు. జులై 2న నూకరాజు అల్లుడు జగదీశ్రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ చంపేశాడని, ఆ తర్వాత ఫ్యామిలీని బెదిరించి ప్రాపర్టీ, బ్యాంక్ లాకర్ డీటైల్స్ లాక్కున్నాడని సూసైడ్ నోట్లో రాశారు. సాదిక్ వేధింపులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో 10 ఏళ్ల మనవడు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు.



