దర్శిగుంటపేటలో మహిళ దారుణహత్య.. ప్రజల ఆందోళన

AP: మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం దర్శిగుంటపేటలో ఈనెల 13న బంగారం కోసం ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల దర్యాప్తులో బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది. మృతురాలు ధరించిన బంగారు నగలను దుండగులు తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదికలో గొడ్డలితో తలపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయం కావడంతో ఆమె మృతి చెందినట్లు తేలింది. హత్య జరిగి నాలుగు రోజులైనా నిందితులను ఇంకా పట్టుకోకపోవడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో పోలీసు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.



