సైబర్ మోసాలపై అవగాహన!

AP : కోనసీమ జిల్లాలో ఉన్న రాజోలు బస్ స్టాండ్ వద్ద సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఫోన్ కాల్స్, ఓటీపీలు, బ్యాంకు వివరాలు అడిగే కొత్త వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.



