PDF ఉపాధ్యాయ MLC అభ్యర్థిగా హనుమంతరావు

AP: 2027లో జరగనున్న కృష్ణా -గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంత రావు పేరును డిక్లేర్ చేశారు. ఇవాళ విజయవాడలో జరిగిన 2003 డీఎస్సీ పెన్షన్ పోరాట వీరుల విజయోత్సవ సభలో ఏపి యుటిఎఫ్, పీడీఎఫ్ ఫోరమ్ ఈ విషయాన్ని ప్రకటించింది. యుటిఎఫ్తోపాటు మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచాయి.



