వర్షాల కోసం ఈ నెల 10న CM వరుణ యాగం

TG: రాష్ట్రంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ నెల 10న నాగార్జునసాగర్లో ప్రభుత్వం వరుణ యాగం చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగం చేయనున్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో ఈ యాగం జరగనుంది. తరువాత పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.



