బర్త్డే పేరుతో NRI కిడ్నాప్

AP : బర్త్డే గ్రాండ్గా చేద్దామని బ్రిటన్ నుంచి రప్పించి, ఒక NRIని స్నేహితులే కిడ్నాప్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన సుమంత్ అనే యువకుడిని తిరుపతి, హైదరాబాద్లలో బంధించి, అతడి టెలిగ్రామ్ ఛానెల్ అమ్మేసి రూ.1.94 కోట్లు తీసుకున్నారు. సుమంత్ తన గర్ల్ఫ్రెండ్కి మెసేజ్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు ఫ్లాట్పై దాడి చేసి రక్షించారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని (బాలాజీ, చరణ్, వాజిద్ బాషాలను) అరెస్ట్ చేశారు.



