శాంతియుత సమావేశాన్ని అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన

AP: విశాఖపట్నంలో డేటా సెంటర్ల వ్యతిరేక శాంతియుత సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన అని HRF(Human Rights Forum) తెలిపింది. గ్రీన్ విశాఖ సభ్యులు భగత్ సింగ్ విగ్రహం వద్ద డేటా సెంటర్ల పర్యావరణ ప్రభావాలపై శాంతియుతంగా సమావేశమైనప్పుడు పోలీసులు వారిని చెదరగొట్టడం దారుణమని ఓ ప్రకటనలో వివరించారు. తర్లువాడలో భూములు కోల్పోయినవారిని కలవకుండా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం, ఆన్లైన్ విమర్శలు తొలగించడాన్ని హెచ్ఆర్ఎఫ్ ఖండిస్తున్నట్టు తెలిపింది.



