విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్

విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్ మారుతోంది. భారత్కు ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థుల్లో నేపాల్ (24.1%) తొలి స్థానంలో నిలిచింది. తర్వాత యూఏఈ (7%), అమెరికా (5.9%), బంగ్లాదేశ్ (5.9%), నైజీరియా (5.7%), జింబాబ్వే(4%) దేశాలు ఉన్నాయి. ఫారిన్ విద్యార్థులకు భారత్ ‘ఎడ్యుకేషన్ డెస్టినేషన్’గా మారుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.



