మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం

విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైర్ యాక్సిడెంట్లో 9మంది మృతి చెందగా, మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో కలిసి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి పదిలక్షల చొప్పున అందిస్తామని స్పష్టంచేశారు.





