అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

TG: నీట్ ఎగ్జామ్లో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తప్పుగా పేర్కొనడంతో ముగ్గురు పరీక్ష రాయకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది. అధికారులు జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి రాజేంద్రనగర్కు బదులుగా జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి హయత్నగర్ అని హాల్టికెట్లో పేర్కొనడంతో విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. హయత్నగర్కు వెళ్లి అక్కడ అడ్రస్ దొరకపోవడంతో అక్కడి నుంచి రాజేంద్రనగర్లోని శివరాంపల్లికి చేరుకున్నారు. శివరాంపల్లికి చేరుకునేలోగా టైమ్ గడిచిపోవడంతో పరీక్ష రాయడానికి అనుమతించలేదు.



