అడ్మిషన్ల జోరు.. ప్రభుత్వ స్కూళ్లలో హౌస్ఫుల్ బోర్డులు

TG: వనపర్తి జిల్లా కేంద్రంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది మొత్తం 905 మంది విద్యనభ్యసించగా, ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య వెయ్యి దాటింది. పదిలో ఏకంగా ఆరు సెక్షన్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం(పి) ZP పాఠశాలలో, సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో, నల్గొండ జిల్లా కేంద్రం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో , సిరిసిల్లలోని గీతానగర్ ZP ఉన్నత పాఠశాలలో అత్యధిక అడ్మిషన్లు వచ్చాయి. దీంతో ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.



