వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 200 కోట్లు విడుదల

AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసనసభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు రూ.200 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటివరకూ వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.518 కోట్లను పరిహారంగా అందించింది.



