← Back to news

నీట్, ప్రశ్నాపత్రాల లీక్‌లపై ప్రతిఒక్కరూ స్పందించాలి: తులసిచందు

By DK· 19 Jul 2026· హైదరాబాద్

TG: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రేపు ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఛలో పార్లమెంట్’‌కు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఛలో పార్లమెంట్‌కు ప్రముఖ జర్నలిస్ట్ తులసిచందు తన మద్ధతు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్‌గా ఉండాలని కోరారు. ప్రధాని మోడీ పాలనలో జరిగిన నీట్, ప్రశ్నాపత్రాల లీక్‌లపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలన్నారు.

More in Education