PCCకి కొండా సురేఖ వివరణ.. నోటీసుపై సురేఖ ఫైర్!

TG: PCC క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ ఆమె పర్సనల్ ఒపీనియన్ అని తెలిపారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులుగా చేయడం సరికాదన్నారు. తనను బాధ్యురాలిని చేయడం న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్పై తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఇన్వాల్వ్మెంట్ లేదని స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన నోటీసును విత్డ్రా చేసుకోవాలని PCC క్రమశిక్షణ కమిటీని కోరారు.



