జర్నలిజం డిప్లమా కోర్సు దరఖాస్తు గడువు పొడిగింపు

AP: ఏపీ సి.ఆర్. మీడియా అకాడమీ–ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో డిప్లమా కోర్సు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్కుమార్ తెలిపారు. జర్నలిస్టులకు ఇంటర్మీడియట్, ఇతర అభ్యర్థులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. జర్నలిస్టులకు రూ.2 వేలు, ఇతరులకు రూ.2,500 ఫీజుగా చెల్లించాలి.



