శ్రీశైలం రహదారిలో ట్రాఫిక్ జామ్
AP: శనివారం ఇండిపెన్డెన్స్ డే, ఆదివారం సెలవు కావడంతో శ్రీశైల దేవస్థానానికి భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో దోమలపెంట నుంచి లింగాలగట్టు వరకు భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. లింగాలగట్టు నుంచి శ్రీశైలం ఎంట్రెన్స్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు బండ్లు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసుల చర్యలు చేపట్టారు.



