కాలేజీల బంద్.. విద్యార్థులకు కీలక అలర్ట్

TG: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని ABVP బంద్కు పిలుపునివ్వడంతో ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు మూతపడనున్నాయి. పెండింగ్లో ఉన్న రూ.12,000 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. సుమారు 20 లక్షల మంది SC, ST, BC, మైనారిటీ విద్యార్థులపై ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభావం పడుతోందని, ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు బంద్ పాటించాలని ABVP పిలుపునిచ్చింది.



