← Back to news

ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం

By Vishi· 19 Aug 2026
ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం

AP: వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఫొటో జర్నలిస్టులు సీఎంను కలిశారు. వాళ్లను సీఎం గ్రూప్ ఫొటో తీశారు. ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. చరిత్రను నమోదు చేస్తూ, జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు అభినందనలు తెలిపారు. మానవ అనుభవాలను అద్భుతమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్న వారికి శుభాకాంక్షలు చెప్పారు.

More in AP