యువతి కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క

TG: గిరిజన యువతుల భద్రత కోసం హైదరాబాద్లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆదివాసీ యువతులకు అండగా ఉండేలా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. హైదరాబాద్లో అత్యాచారం, హత్యకు గురైన భద్రాద్రికొత్తగూడెం జిల్లా యువతి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి వ్యవసాయ భూమి, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.



