అంబులెన్స్లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

TG: హైదరాబాద్లోని నాచారం ప్రాంతానికి చెందిన నిషా భానుకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పైలట్ ఉపేందర్ వెంటనే గర్భిణిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో పురిటినొప్పులు తీవ్రం కావడంతో డాక్టర్ల సూచనలతో అంబులెన్స్లోనే ప్రసవం నిర్వహించారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో నిషా భాను మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.



