ఆకలితో ఉన్నవారికి అండగా.. పోలీసుల కమ్యూనిటీ ఫ్రిజ్లు

AP: విశాఖ నగరంలో ఆకలితో ఉన్నవారికి వైజాగ్ సిటీ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ‘మిషన్ జ్యోతిర్గమయ’లో భాగంగా పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్లను ప్రారంభించారు. వీటి ద్వారా నిరాశ్రయులు, ఆకలితో ఉన్నవారు, అవసరమైన వారికి ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. మిగిలిన ఆహారం వృథా కాకుండా అవసరమైన వారికి చేరేలా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఈ సేవ కొనసాగుతోంది.

