మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,040 పెరిగి రూ.1,54,860 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.950 పెరిగి రూ.1,41,950 వద్ద, 18 క్యారెట్ల బంగారంపై రూ.770 పెరిగి రూ.1,16,140కి చేరింది. బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో కొనేవారు భయపడుతున్నారు.



